మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో శ్రీ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఆదివారం ఎంపిడిఓ కార్యాలయ ఆవరణంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్ గిరిజన వేశాధారణలో ఉన్న మహిళలతో కలిసి గిరిజన నృత్యాలు చేశారు. శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.