మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గట్టు ముసలమ్మ దేవాలయంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. దేవాలయ తాళాలు పగలగొట్టి, రెండు హుండీలను పగలగొట్టి డబ్బులు దోచుకెళ్లారు. ఇతర సామాగ్రిని కూడా చిందరవందర చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.