మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ లు కలిసి ప్రారంభించారు. రైతులు దళారుల చేతుల్లో మోస పోకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవాలని రైతులకు సూచించారు.