మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగత్రావుపేటలో పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. 440 లీటర్ల బెల్లం పానకం, 20 కేజీలపటికి, 5 కేజీల నల్ల బెల్లం, 40 లీటర్ల గుడుంబా, సరైన పత్రాలు లేని 16 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.