జనగామలో హైకోర్టు అడ్వకేట్ ఎండీ. సాదిక్ అలీ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను మున్సిపల్ ఛైర్పర్సన్ బాలమణి, మార్కెట్ చైర్మెన్ శివరాజ్ యాదవ్ బుధవారం నాడు విరమింపజేశారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఫోన్లో సాదిక్ అలీతో మాట్లాడి, బక్రీద్ పండుగ ముగిసిన వెంటనే కలెక్టర్తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీతో సాదిక్ అలీ నిమ్మరసం సేవించి దీక్ష విరమించారు.