జనగామ జిల్లా కృష్ణాజిగూడెంలో ఇటీవల చనిపోయిన వ్యక్తి కొడుకు గుండు చేయించుకున్నాడు. కర్మకాండల అనంతరం ఉపాధి హామీ పనికి వెళ్లగా, ఫేస్ ఐడెంటిఫికేషన్ యాప్ అతన్ని గుర్తించలేకపోయింది. దీంతో హాజరు నమోదు కాలేదు. ఈ సమస్యను అధిగమించడానికి, అతను తన భార్య జడతో కలిసి ఫోటో దిగి యాప్లో అప్లోడ్ చేయగా హాజరు నమోదైంది. ఇలాంటి సమస్యలు చాలా ప్రాంతాల్లో ఎదురవుతున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కూలీలు కోరుతున్నారు.