ప్రధాని నరేంద్ర
మోదీ, ఈనెల 10న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆధునీకరించిన జనగామ రైల్వే స్టేషన్ ను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అమృత్
భారత్ పథకంలో భాగంగా కొత్త రంగులు, ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలు, మౌలిక వసతులతో ఈ స్టేషన్ను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. అభివృద్ధికి చిహ్నంగా మారిన ఈ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు.