జనగామ పట్టణంలోని మూడవ వార్డు సాన్ మేరియా స్కూల్ గేట్-1 కాలనీలో నెలకొన్న మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బూడిది గోపి డిమాండ్ చేశారు. గురువారం, మున్సిపల్ ఏఈ వంశీకృష్ణను కలిసి వినతిపత్రం సమర్పించిన గోపి, కాలనీలో రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.