ద్విచక్రవాహనం వ్యాన్‌ను ఢీకొట్టి.. అన్నదమ్ముల దుర్మరణం

10చూసినవారు
ద్విచక్రవాహనం వ్యాన్‌ను ఢీకొట్టి.. అన్నదమ్ముల దుర్మరణం
జనగామ మండలం వడ్లకొండకు చెందిన మరాటి దినేష్ (24), సమీప బంధువైన భానూశ్‌ (21)లు మంగళవారం సాయంత్రం హోలీ ఆడుకుని ద్విచక్రవాహనంపై సిద్దిపేట రోడ్డు నుంచి వంతెన పై వెళ్తుండగా, బస్టాండ్‌ నుంచి వస్తున్న వ్యాన్‌ను వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో దినేష్, భూనూశ్‌ తీవ్రంగా గాయపడగా, వ్యాన్‌ డ్రైవర్‌ శివకృష్ణగౌడ్‌ గాయపడ్డాడు. ముగ్గురిని జనగామ జనరల్‌ ఆసుపత్రికి తరలించగా, దినేష్, భూనూశ్‌ హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందారు. సీఐ సత్యనారాయణరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్