మహబూబాబాద్ జిల్లా గూడూరు ఫారెస్ట్ రేంజ్ పరిసర ప్రాంతాల్లో చిరుత పులి ఆచూకీ తెలిసినవారు సమాచారం ఇవ్వాలని గూడూరు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ రావు తెలిపారు. ఖానాపూర్ మండలంలో చిరుతపులి సంచరించిన నేపథ్యంలో పశువుల కాపరులు జాగ్రత్త తీసుకోవాలన్నారు. నర్సంపేట, కొత్తగూడ, గూడూరు రేంజ్ పరిధిలో చిరుత సంచరించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.