మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిరసన చేపట్టినట్లు బీజేపీ మండలాధ్యక్షుడు రమేశ్ తెలిపారు. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది.