తెలంగాణలో ప్రస్తుతం దంచికొడుతోన్న ఎండలు.. రాబోయే మూడు రోజులు మరింతగా పేరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. క్రమంగా రెండు, మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అటు రేపు ఉదయం 8.30 గంటల వరకు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.