మహబూబాబాద్ పట్టణంలోని సర్వేపల్లి రాధాకృష్ణ సెంటర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భూక్య నవీన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసముద్రం మండలం బడితండకు చెందిన నవీన్ ను టిప్పర్ ఢీకొట్టింది. టిప్పర్ కింద ఇరుక్కున్న మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.