మహబూబాబాద్లో నూకల రామచంద్రారెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామచంద్రారెడ్డి పేదలు, రైతుల సంక్షేమానికి పాటుపడ్డారని, మంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.