మహబూబాబాద్ పట్టణంలో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పర్యటించారు. ప్రజల సౌకర్యం కోసం నిర్మించిన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించకపోవడంపై ఆయన అధికారులను ప్రశ్నించారు. వాటర్ ట్యాంక్ ద్వారా నీటి సరఫరాను త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.