అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన మేఘన, భావనల మృతదేహాలు ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్లోని వారి స్వగ్రామానికి చేరుకున్నాయి. ఉన్నత చదువుల కోసం వెళ్లిన తమ పిల్లల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాదకర సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.