ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బడే నాగ జ్యోతి అటవీశాఖ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలున్నా గిరిజన పోడు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాడ్వాయి మండలం కాల్వపల్లిలో గిరిజన పోడు రైతులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీశాఖ అధికారులు కందకాలు తీయడం సరికాదని, ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు.