భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన దుర్గా కుటుంబసభ్యులు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మలకు మొక్కు కింద 116 మొక్కలు నాటుతామని మొక్కుకున్నారు. తాడ్వాయి-మేడారం మధ్య లక్షల చెట్లు కూలిపోయిన ప్రాంతంలో బుధవారం 116 మొక్కలు నాటి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారిని అటవీశాఖ అధికారులు అభినందించారు.