రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కుటుంబ సభ్యులతో కలిసి శనివారం మేడారం సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. గద్దెల వద్దకు చేరుకుని దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. తన బరువుకు సమానమైన నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) మొక్కుగా చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, దేవదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.