మహాజాతరలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకల గుట్టను విడిచి సంప్రదాయబద్ధంగా జనంలోకి వచ్చిన సమ్మక్క తల్లి గద్దెపైకి చేరుకోవడంతో లక్షలాది మంది భక్తులు పారవశ్యంతో పరవశించి పోయారు. అడుగడుగునా సమ్మక్క నామస్మరణతో వనం దద్దరిల్లింది. సంప్రదాయ పూజల అనంతరం పూజారులు కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క తల్లిని తీసుకువచ్చారు.