మేడారంలో సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన స్టేషన్ ఘన్పూర్కు చెందిన కుటుంబానికి చెందిన దీక్షిత, చేతన్, వేక్షిత్ అనే ముగ్గురు చిన్నారులు భక్తుల రద్దీలో తల్లిదండ్రుల నుంచి తప్పిపోయారు. వెంటనే పోలీసులను ఆశ్రయించగా, ఎస్సై కమలాకర్ సిబ్బందితో కలిసి మైక్ అనౌన్స్మెంట్లు, గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం 30 నిమిషాల్లోనే చిన్నారులను జంపన్న వాగు వద్ద గుర్తించి, వారి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.