మేడారం మహా జాతరకు ఇంకా 56 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే ఈ జాతరకు భక్తులు ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటారు. సుమారు రూ. 150 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీ పెరిగితే పనులు అడ్డుపడే అవకాశం ఉంది.