
ఐదు రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత: సజ్జల
ఏపీలో ఐదు రోజులుగా నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో కీలక నేత, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే ఈ ఇంధన కొరత ఏర్పడటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు తన విజన్ గురించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కమీషన్ల కోసమే ఈ కొరత సృష్టిస్తున్నారని సజ్జల ఆరోపించారు.




