వరంగల్ జిల్లా నెక్కొండ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న లక్కపురుగుల సమస్యను ప్రజలు గ్రామపంచాయతీ కార్యదర్శి కి ఫిర్యాదు చేశారు. ఆ సమస్యపై వెంటనే స్పందించిన కార్యదర్శి శనివారం ఎఫ్సీఐ గోదాములకు వెళ్లి తనిఖీ చేశారు. లక్క పురుగుల నివారణ కోసం వెంటనే మందులను స్ప్రే చేయాల్సిందిగా ఎఫ్సీఐ సిబ్బందికి తెలియజేశారు. వారితోపాటు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.