జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవాలయాన్ని మార్చి 3న ఉదయం 8 గంటలకు చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నట్లు ఈవో లక్ష్మీ ప్రసన్న తెలిపారు. మార్చి 4న ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు సహకరించాలని ఆయన కోరారు.