జనగామ జిల్లాలోని పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ గుట్ట పరిసరాలు విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. గర్భగుడి ప్రాంగణం, క్షీరాద్రి కొత్త శోభను సంతరించుకున్నాయి. ఆలయం ప్రధాన రోడ్డుపై ఉండటంతో, పాలకుర్తి - స్టేషన్ ఘన్పూర్ మార్గం గుండా ప్రయాణించే భక్తులు, ప్రజలు ఈ విద్యుత్ అలంకరణలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పట్టణవాసులు కూడా ఈ కాంతులపై హర్షం తెలిపారు.