విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్వీ పోరుబాట: పోస్టర్ ఆవిష్కరణ

888చూసినవారు
విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్వీ పోరుబాట: పోస్టర్ ఆవిష్కరణ
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న పోరుబాటకు సంబంధించిన పోస్టర్‌ను పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద సుమారు రూ.8 వేల కోట్ల బకాయిలను చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా, పరకాలలో ఈ సంఘటన జరిగింది.

సంబంధిత పోస్ట్