వరంగల్-నర్సంపేట రహదారి ధర్మారం వద్ద ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొన్న ఘటనలో లక్కర్సు రవీందర్, ముదం నవీన్కు తీవ్ర గాయాలయ్యాయి. నర్సంపేటలో అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రవీందర్ కడుపు, కుడి కాలుకు బలమైన గాయాలయ్యాయి. నవీన్కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వరంగల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ ఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.