పరకాల పట్టణంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నిర్వహించిన కార్నర్ మీటింగ్లో, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి దూరమైన పట్టణాన్ని ప్రత్యేక డిపిఆర్ వ్యవస్థతో మంచినీటి సరఫరా, సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పట్టణాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్నామని, గత బిఆర్ఎస్ పాలకులు అభివృద్ధి పేరుతో దోచుకున్నారని ఆరోపించారు.