స్టేషన్ ఘన్పూర్ బస్టాండ్ సమీపంలో గంజాయి విక్రయానికి ప్రయత్నించిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 50 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ వేణు ఆదేశాల మేరకు ఎస్సైలు పిట్ట రాజేష్, రమేష్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జనగామ కోర్టుకు తరలించారు.