ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైన తెలంగాణ నాయకులు ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చి సిట్ విచారణకు పిలిపించారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. స్టేషన్ ఘన్పూర్ లో జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్న ఆయన, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.