వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్ కు మహోన్నత సేవా పతకం దక్కింది. క్రైమ్ ఏసిపి సదయ్య, ఏఎస్సై వేణుగోపాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ కు ఉత్తమ సేవా పతకాలు లభించాయి. మరో తొమ్మిది మంది అధికారులు కూడా సేవా పతకాలకు ఎంపికయ్యారు. వీరిలో ఎస్సై కనక చంద్రం, ఇతర ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్ళు ఉన్నారు.