2025-2026 ఆర్థిక సంవత్సరానికి వరంగల్ అర్బన్ కోపరేటివ్ బ్యాంక్ 22% వృద్ధితో 454.72 కోట్ల టర్నోవర్ సాధించిందని చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు. వరంగల్ నగరంలో జరిగిన 30వ మహాసభలో ఆయన బ్యాంక్ ఆర్థిక లావాదేవీలపై నివేదిక సమర్పించారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ 10 శాఖలకు విస్తరించింది. త్వరలో హైదరాబాద్లో కొత్త శాఖ ఏర్పాటుకు RBI ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి షేర్ హోల్డర్లకు 12% లాభాలు పంచనున్నట్లు తెలిపారు.