వరంగల్ ఉర్సు ఎస్సీ కాలనీలో నివాసముండే ఎనిమిది సంవత్సరాల బాలికపై కిరాణా షాప్ యజమాని అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. చాక్లెట్ల కోసం షాపుకు వెళ్ళిన బాలిక పట్ల షాప్ యజమాని కమల్ అసభ్యంగా ప్రవర్తించాడని, మరో గిరాకి రావడంతో బాలిక తప్పించుకుని ఇంటికి వచ్చి తల్లికి విషయం చెప్పిందని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.