పరకాల పట్టణంలో శనివారం పోలీసులు అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం తనిఖీలు నిర్వహించగా, మంద అరవింద్ అనే వ్యక్తి టూ వీలర్తో అనుమానాస్పదంగా కనిపించాడు. విచారణలో అతను బైకు దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. సీఐ క్రాంతి కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దొంగను పట్టుకున్నారు. ఈ ఘటనలో ఎస్సై పవన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సీఐ క్రాంతి కుమార్ తన బృందాన్ని అభినందించారు.