కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఖానాపూర్ స్పెషల్ బ్రాంచ్ ఎస్సై ఎండి ఆసిఫ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.