వరంగల్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో దేశీ మిర్చి క్వింటాకు రూ.41,200 రికార్డు ధర పలికింది. గత మూడేళ్లలో ఇదే అత్యధిక ధర అని మార్కెట్ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన దస్తగిరి అనే రైతు తెచ్చిన 6 క్వింటాళ్ల మిర్చిని వ్యాపారులు ఈ ధరకు కొనుగోలు చేశారు.