హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం బావుపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి సందర్శించారు. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ధాన్యం వివరాలను, ఇప్పటివరకు జరిగిన కొనుగోలును, అక్కడి సౌకర్యాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్వాహకులకు ఆయన సూచనలు చేశారు.