వరంగల్లోని భద్రకాళి బండ్ – పోతననగర్ మార్గంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకం, ఈదురుగాలుల కారణంగా తలక్రిందులై కంబానికి ఇరుక్కుపోయింది. శుక్రవారం చినిగిపోయిన ఈ సంఘటన స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. జాతీయ గౌరవానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాకం ఇలా ఉండటంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి కొత్త జెండాను కట్టి, మళ్లీ రెపరెపలాడేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.