ప్రజాపాలన ప్రగతి ప్రణాలికలో భాగంగా, వరంగల్ పోలీస్ కమిషనరేట్ భరోసా కేంద్రం సిబ్బంది హనుమకొండలోని కేంద్ర గ్రంథాలయం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్, ఐడియల్ బ్యూటీ అకాడమీలలో మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భరోసా సేవలు, పితృస్వామ్యం, స్త్రీ ద్వేషం, లైంగిక దోపిడీ, బాల్య వివాహాలు, బాలలపై లైంగిక వేధింపులు, సైబర్ స్టాకింగ్, సైబర్ మోసాలు, సైబర్ సెక్యూరిటీ, బాలల హెల్ప్లైన్-1098, సైబర్ క్రైమ్ హెల్ప్లైన్-1930 వంటి అంశాలపై వివరించారు.