
భారత నౌకలపై దాడి.. ఖండించిన ట్రంప్
ఒమన్ తీరంలో భారతీయ నౌకలపై జరిగిన దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఇదంతా ఇరాన్ నిర్వాకమేనని ఆయన ఆరోపించారు. ఇరాన్ దాడికి ప్రయత్నిస్తే తమ బలగాలే అడ్డుకున్నాయని ట్రంప్ తెలిపారు. అయితే, హార్ముజ్లోని భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై తామే దాడిచేసినట్టు సెంట్రల్ కమాండో అంగీకరించింది. ఒప్పందంపై ఇరాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.




