రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ యాప్లకు బానిసై, డబ్బు పోగొట్టుకుని, అప్పులు తీర్చలేక ఈ దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ దొంగను పట్టుకోవడం తమకు సవాల్గా మారిందని, దానిని ఛాలెంజ్గా స్వీకరించి పట్టుకున్నామని కేయూ సీఐ రవికుమార్ తెలిపారు.