వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ఆయన 48, 49 డివిజన్ల పరిధిలో రూ. 9.37 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 7.50 కోట్ల వ్యయంతో NIT నుంచి లోటస్ కాలనీ వరకు R&B రోడ్డు నిర్మాణం, సెంటర్ లైటింగ్తో పాటు, 48వ డివిజన్లో రూ. 50 లక్షలతో అంతర్గత రోడ్లు, రూ. 1.37 కోట్లతో లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు.