ఈ నెలాఖరున వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్ తెస్తున్నామని, అయితే తమకు ఎందుకు ఇవ్వరో ప్రశ్నిస్తూ, ప్రధాని మోడీని కలిసి బుల్లెట్ ట్రైన్ ఇస్తారా లేక చస్తారా అని అడుగుతామని, ఇవ్వకపోతే కొట్లాడుతామని, ఒకటికి పదిసార్లు అడుగుతామని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.