హనుమకొండ జిల్లా విద్యాధికారి (డీఈవో) గా పనిచేస్తున్న వాసంతిని ప్రభుత్వం తొలగించింది. ఆమె స్థానంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిని డీఈవో గా నియమించింది. ఒక అదనపు కలెక్టర్ను డీఈవోగా నియమించడం, మరోవైపు ప్రస్తుత డీఈవోను తొలగించడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం ప్రస్తుత ప్రజా పరిపాలన తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.