కాజీపేట మండలం మడికొండలో పారిశుధ్య లోపం తీవ్రమైంది. వివిధ కాలనీలలో డ్రైనేజీలలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, డిస్పోజల్ గ్లాసులతో మురుగు నీరు నిలిచిపోతోంది. వర్షపు నీరు బయటకు వెళ్లే దారి లేక, ఈగలు, దోమల బెడదతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ సిబ్బంది డ్రైనేజీలను శుభ్రపరచి, ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.