వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ నూతన సూపరింటెండెంట్ డా. పి. హరీష్ చంద్రా రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్యశారదను కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎంజీఎం ఆసుపత్రిలోని పలు సమస్యలపై ఇరువురు నాయకులు కాసేపు చర్చించారు. ఈ సమావేశం వరంగల్ జిల్లా వైద్య రంగంలో కీలక మార్పులకు నాంది పలికే అవకాశం ఉంది.