కాజీపేట రైల్వే స్టేడియంలో జనవరి 11 నుంచి 15 వరకు 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు నిర్వహించబడనున్నాయి. తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 2వేల మంది క్రీడాకారులు హాజరవుతారని ఆయన తెలిపారు.