హన్మకొండ జిల్లా
కాంగ్రెస్ పార్టీలో భాగంగా పలు మండలాలు, డివిజన్లకు నూతన అధ్యక్షులను నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాయకులకు పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. నాయకత్వం అప్పగించిన బాధ్యతలను సమిష్టి కృషితో విజయవంతం చేసి, ప్రజలకు మరింత చేరువ కావాలని వారు పిలుపునిచ్చారు.