గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఆవరణలో ఆదివారం ఓ పాము కలకలం సృష్టించింది. క్యాంటీన్ ముందు భాగంలో పామును చూసిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సెలవు దినం కావడంతో జన సంచారం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి వర్షాల కారణంగా భూమి లోపల ఉన్న పాములు, సరీసృపాలు తలదాచుకోవడానికి బయటకు వస్తున్నాయని స్థానికులు తెలిపారు.